Archive for May 21st, 2008

కేసీఆర్‌వి రంకు రాజకీయాలు (andhrajyothy, 21-5-2008)

May 21, 2008

సిరిసిల్ల ఎమ్మెల్యే రాజేశ్వర్‌రావు
సిరిసిల్ల, మే 20 (ఆన్‌లైన్‌): రాజీనామాలు చేసి కేసీర్‌ రంకు రాజకీయాలు చేస్తున్నాడని, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని సిరిసిల్ల ఎ మ్మెల్యే సిహెచ్‌ రాజేశ్వర్‌రావు అన్నారు. మంగ ళవారం సిరిసిల్లలో టిడిపి అభ్యర్థి రమణ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ తె లంగాణ కోసం ఏనాడూ పార్లమెంట్‌లో మా ట్లాడిన పాపాన పోలేదన్నారు. టిడిపి అభ్యర్థి రమణ బలహీన వర్గాలకు అండగా ని లుస్తాడని కేసీఆర్‌కు [...]

‘మా తెలంగాణ మాక్కావాలె’ (Amdhrajyothy, 21-5-2008)

May 21, 2008

కలెక్టరేట్‌ ఎదుట మట్టిమనుషుల ధర్నా
నల్లగొండ, మే 20 (ఆన్‌లైన్‌): వాడైతేంది… వీడైతేంది… ఎవడైతే మాకేం ది… మా తెలంగాణ మాక్కావాలె అంటూ మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట టెంట్‌ వేసి, టెంట్‌ నిండా చెప్పులు పరిచి తెలంగాణ మట్టి మనుషులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, విద్యావంతుల వేదిక జి.వెంకటేశ్వర్లు, రచయితల వేదిక వేణు సంకోజు, ఉద్యోగుల సంఘం కన్వీనర్‌ వి.కృష్ణ పాల్గొన్నారు.

‘కాకా’ గేట్‌ మీటింగ్‌లో (Andhrajyothy, 21-5-2008)

May 21, 2008

తెలంగాణ అనాలని కార్మికుల డిమాండ్‌
తప్పుకున్న వెంకటస్వామి
గోదావరిఖని, మే 20 (ఆన్‌లైన్‌): కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో మం గళవారం జిడికె5గని వద్ద జరిగిన గేట్‌ మీటింగ్‌లో ఎంపి వెంకటస్వామిని జైతెలంగాణ అనాలంటూ కార్మికులు పట్టుబట్టారు. అంతకుముందు తెలం గాణ వస్తుంది… అది కాంగ్రెస్సే ఇస్తుంది…  

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం (Andhrajyothy, 21-5-2008)

May 21, 2008

కానీ ప్రత్యేకం పరిష్కారం కాదు
కాంగ్రెస్‌ ఓ అబద్దాల పుట్ట
జలయజ్ఞఃపై ‘మద్యంతర దిద్దుబాటు’
బీజేపీని ఓడించేందుకు అవసరమైతే టీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తాం
‘మీట్‌ దిప్రెస్‌’లో రాఘవులు
హైదరాబాద్‌, మే 20 (ఆన్‌లైన్‌): మార్క్సిజం కోణంలో… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను తప్పకుండా గౌరవిస్తామని, పరిశీలిస్తామని, అయితే, ఈ ప్రాంత సమస్యలకు వారు కోరుతున్నట్లు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే పరిష్కారం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పునరుద్ఘాటించారు. ఒక్క తెలంగాణ ఏర్పాటే కాకుండా దేశవ్యాప్తంగా [...]

అవును. తెలంగాణలో సెంటిమెంటు ఉంది..ః రోజా (Andhrajyothy, 21-5-2008)

May 21, 2008

నిజామాబాద్‌, మే 21 ః ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో కొత్త పార్టీల అవశ్యకత ఎంతమాత్రం లేదని తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సినీనటి రోజా అభిప్రాయ పడ్డారు. తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చే యడానికి నిజామాబాద్‌ వచ్చిన రోజా ‘ఆన్‌లైన్‌’ తో మాట్లాడారు.

ప్రత్యేక తెలంగాణ మూడున్నరకోట్ల ప్రజల ఆకాంక్ష (Andhrajyothy, 21-5-2008)

May 21, 2008

అదిలాబాద్‌, మే 21 ః తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్ష ఇక్కడి ప్ర జల్లో బలంగా ఉందని, తెలంగాణవాదాన్ని వారు కడుపు లో పెట్టుకుని కాపాడుకుంటారని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి మధు సూదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ లో అధ్యక్షుడు పిల్లలమర్రి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇక 24 గంటలూ బీరు ఉత్పత్తి (Eenadu, 21-5-2008)

May 21, 2008

జూన్‌ వరకూ ఐదు కంపెనీలకు అనుమతి
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
ఉప ఎన్నికల డిమాండే కారణం
తాగిన వారికి తాగినంత మద్యం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఉప ఎన్నికలు, వేసవితాపాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మూడో షిఫ్టులో కూడా మద్యం తయారీకి ఐదు బీరు కంపెనీలకు అనుమతినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలూ మద్యం తయారీకి వీలు కల్పించినట్త్లెంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు బ్రూవరేజీల్లో రెండు షిఫ్టుల్లో ఏటా 1465 లక్షల బల్కు లీటర్ల బీరు తయారవుతుంది. ఇందులో 5 కంపెనీలు…

May 21, 2008

తెరాస గెలుపు తర్వాత జరిగేదిదే
ఢిల్లీ నుంచి సమాచారం ఉంది
కేసీఆర్‌ సంచలన ప్రకటన
జనగామ, సంగారెడ్డి, కొండపాక-న్యూస్‌టుడే’ఈ ఉప ఎన్నికల్లో తెరాస అన్ని స్థానాల్లో గెలుపు సాధిస్తే పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఉద్వాసన పలికి మరొకరిని ముఖ్యమంత్రి పీఠంపైకి ఎక్కించేందుకు, ప్రత్యేక తెలంగాణను ప్రకటించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు నాకు నిన్న రాత్రి.. ఈ రోజు పొద్దున ఢిల్లీ నుంచి విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసింది’ అని తెరాస అధినేత కేసీఆర్‌ చెప్పారు. [...]

రిఫరెండం (Eenadu, 21-5-2008)

May 21, 2008

తెరేస ప్రజాప్రతినిధుల పనితీరుకు
తెలంగాణ వాదంపై కాంగ్రెస్‌కే పేటెంట్‌
2004 పొత్తువల్ల లబ్ధి పొందింది వారే
సానుకూల ఓట్లతోనే విజయం సాధిస్తాం
కోడ్‌ ఉల్లంఘన తెలియక చేసిన తప్పే
‘న్యూస్‌టుడే’ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి వైఎస్‌

బడి ఆవరణలోనే సభ (Eenadu, 21-5-2008)

May 21, 2008

జానా, పొన్నాల, సురేఖలకు నేడు నోటీసులు?
ప్రైవేటు స్థలమని అధికారులిచ్చిన నివేదిక తప్పు
సీఈవో విచారణలో బయల్పడిన నిజం
ఈసీకి నివేదన
అమాత్యుల పర్యటనలపై కఠిన ఆంక్షలు
ఎన్నికల జిల్లాల్లో అధికారికంగా పర్యటించరాదు
అధికారులతో భేటీలూ కుదరవు
పింఛన్లపై ముఖ్యమంత్రికి క్లీన్‌చిట్‌

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే : ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కొందరు మంత్రులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, అధికారులు పాలక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. మంత్రులు, పాలక పక్ష అభ్యర్థులు నియమావళికి విరుద్ధంగా ప్రభుత్వ భవనాల ఆవరణల్లో ప్రచారం చేసుకుంటున్నా..